Telugu poems
వేమన
| యోగి వేమన | |
|---|---|
హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై వేమన విగ్రహం ( విగ్రహం శిలాఫలకం పై వ్యాఖ్య:"ఆటవెలదిని ఈటెగావిసిరిన దిట్ట/ ఛాందసభావాలకు తొలి అడ్డుకట్ట") | |
| పుట్టిన తేదీ, స్థలం | సా.శ1367(?) కడప జిల్లాకి చెందిన వారు. |
| మరణం | రెడ్డి శకం 1478 కటారు పల్లె గ్రామం |
| వృత్తి | కవి, సంఘసంస్కర్త |
| సంతకం | దస్త్రం:దాబి రాముడు |
వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. "విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు తెలుగు వారికి సుపరిచితాలు. వేమన సుమారు 1367 - 1478 మధ్య కాలములో జీవించాడు. వేమన ఏ కులానికి చెందినవాడు అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. CP బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తకం రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించాడు. ఆటవెలదితో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చాడు.
జీవితం
[మార్చు]వేమన కాలం గురించీ, జీవితం గురించీ సి.పి. బ్రౌన్, వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేమూరి విశ్వనాధశర్మ, కొమర్ Biography of mahatma gandhi.